తిరువణ్ణామలైలో దారుణం.. కుటుంబం మొత్తాన్ని గొడ్డలితో దారుణంగా నరికి హత్య చేసిన తండ్రి

by Mahesh |   ( Updated:2022-12-13 05:27:27.0  )
తిరువణ్ణామలైలో దారుణం.. కుటుంబం మొత్తాన్ని గొడ్డలితో దారుణంగా నరికి హత్య చేసిన తండ్రి
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. చెన్నై సమీపంలోని తిరువణ్ణామలైలో ఓ తండ్రి రాత్రికి రాత్రే కుటుంబాన్ని మొత్తం దారుణంగా హత్య చేశాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరువణ్ణామలైలో నివాసం ఉంటున్న పళని కుటుంబ కలహాల కారణంగా రాత్రికి రాత్రే భార్య ఐదుగురు పిల్లలను గొడ్డలితో నరికి వేశాడు. దీంతో భార్య వల్లీ, చిన్నారులు శిరీష, మనీషా, శివశక్తి, ధనుష్ లు మృతి చెందారు. కాగా మరో చిన్నారి.. భూమిక తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. దారుణానికి ఒడిగట్టిన నిందితుడు పళణి హత్యల అనంతరం తాను ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Read More....

గద్వాల జిల్లాలో దారుణం.. 70 కి పైగా గొర్రెపిల్లల గొంతు కోసి చంపిన దుండగులు

Advertisement

Next Story

Most Viewed